ఇంటింటికీ ఇంటర్నెట్: కేటీఆర్

ఇంటింటికీ ఇంటర్నెట్: కేటీఆర్ తెలంగాణలో టీ-ఫైబర్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న ఆయన.. ఇందుకోసం టీ-ఫైబర్ పనులను వేగవంతం చేశామని సిరిసిల్లలో అన్నారు. అటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అడవులను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.